Thursday, September 12, 2024

AP | ఎంపీడీఓ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు

పశ్చిమ గోదావరి నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు గత 4 రోజులుగా అదృశ్యమయ్యాడు…. ఆయ‌న ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో రమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. రమణారావు చివరిసారిగా ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఏం చెప్పాడు? అయ‌న‌ ఒత్తిడికి కారణాలేంటి? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నిజాయితీ పరుడు, సమర్థుడైన అధికారి ఆచూకీ లేకుండా పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఘ‌టనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. ఎంపీడీవో కుటుంబాన్ని ఆదుకుంటామని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణితో కూడా మాట్లాడిన సీఎం… ఘటనపై లోతుగా విచారణ జరపాలని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement