Saturday, October 19, 2024

AP | రాజధాని పనులను పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. సీఆర్డీఏ పనుల ద్వారా రాజధాని పనులను ఆయన ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో రూ. 160 కోట్లతో ఎనిమిది అంతస్తుల సీఆర్డీఏ కార్యాలయ పనులను ప్రారంభించారు. ఆ పనులు మధ్యలో ఆగిపోయాయి.

ఇప్పుడు సీఆర్డీఏ కార్యాలయం నుంచే పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం వద్ద పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడ చంద్రబాబు పూజలు నిర్వహించారు. మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అదనంగా ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ కు 2.51 ఎకరాలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ బిల్డింగ్ లో ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ పనులు పెండింగ్ లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement