Wednesday, September 18, 2024

Srisailam: కృష్ణానదికి జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

శ్రీశైలం/నంద్యాల జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు శ్రీశైల క్షేత్ర పర్యటనలో భాగంగా గురువారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానంతరం ఉదయం 12-30 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకొని రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి అన్ని ప్రాజెక్టులకు ముఖ చిత్ర మ్యాప్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించారు. శ్రీశైలం డ్యామ్ ఎస్ఈ శ్రీరామచంద్ర మూర్తి సాగునీటి ప్రాజెక్టుల వివరాలను సీఎంకు నివేదించారు.

శ్రీశైలం ప్రాజెక్టు పరిశీలన అనంతరం కృష్ణానదికి జలహారతినిచ్చి కృష్ణమ్మకు చీరే సారే నీటిలో వదిలి వాయనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, డిఐజీ కే ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఆలయ ఈఓ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement