Friday, October 18, 2024

AP: మహానందిశ్వుడి సేవలో సీఐడీ డైరెక్టర్

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో సీఐడీ డైరెక్టర్ నగేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం శ్రీకామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ఆనవాయితీ ప్రకారం యాగశాలలో అర్చకులు కండువా కప్పి స్వామివార్ల ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆయన వెంట సీఐడీ ఎస్ ఐ భరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుల్ సుధీర్, రామిరెడ్డిలు వున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement