Friday, September 27, 2024

Chittoore – మొగిలి ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం – ఇద్దరి మృతి

చిత్తూరు, సెప్టెంబర్ 26 (ప్రభ న్యూస్ బ్యూరో) చిత్తూరు జిల్లా బంగారు పాల్యము మండలం మొగిలి ఘాట్ వద్ద గురువారం వేకువ ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

బ్రేక్ డౌన్ అయి ఆగి ఉన్న కొయ్యల లారీని వెనుక భాగం నుంచి మరొక లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. లారీలు ఢీ కొనగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. లారీలోని ఆయిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు ఎగిసి పడ్డాయి. ఒక లారీ రహదారి పక్కలోని లోయలో బోల్తా పడింది. లారీ డ్రైవర్ అందులో ఇరుక్కుని దుర్మరణం చెందాడు. మరో లారీ కింద పడుకునే నిద్రిస్తున్న వ్యక్తి మంటల్లో చిక్కుకొని మృతి చెందాడు.

విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. బంగారు పాల్యం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలం చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement