Tuesday, October 1, 2024

కుప్పంలో ఏనుగుల దాడి – ఇద్దరి మృతి

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందారు. నలుగురిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో మహిళ, పురుషుడు మృతి చెందారు. ముగ్గురు మహిళలతోపాటు పురుషుడిపై రెండు ఏనుగులు దాడి చేశాయి. దీంతో మహిళ, పురుషుడు మృతి చెందగా, మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు కుప్పం మండలం పర్తిచేను గ్రామానికి చెందిన ఉష (42), సప్పాని కుంట గ్రామానికి చెందిన శివలింగంగా గుర్తించారు.

మృతురాలు ఉష బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున బెంగళూరుకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్తోన్న ముగ్గురు మహిళలపై మొదటగా ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో ఉష చనిపోగా, మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి అటవీ అధికారులు… రెండు ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు యత్నించారు. కుప్పంలో ఏనుగుల దాడిలో మరో వ్యక్తి మృతి చెందారు

Advertisement

తాజా వార్తలు

Advertisement