Friday, September 13, 2024

AP: పవర్ స్టార్ సీఎం కావాలి : పొర్లుదండాలతో తిరుమ‌ల‌కు వీరాభిమాని

చంద్రగిరి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఈశ్వర్ రాయల్ అనే వీరాభిమాని శ్రీవారి మెట్టుమార్గంలో ఈరోజు పొర్లుదండాలతో మొక్కు తీర్చుకున్నాడు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ మెగాస్టార్ చిరంజీవికి వీర అభిమాని.. ఈరోజు అతను చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు.

అందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్ల మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు బయలుదేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత 21 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నానని చెప్పారు.

ఈనెల 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని నేడు తిరుమలకు పొర్లుదండాలు పెడుతూ వెళుతున్నానని తెలిపారు. చిరంజీవి అతని కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుతున్నానన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినందుకు కూడా మొక్కు తీర్చుకుంటూ ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, తదితరులు పాల్గొని సహకారం అందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement