Friday, October 4, 2024

AP: ఏపీ ప్రెస్ అకాడమీని ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్పు ?

ఏపీ ప్రెస్ అకాడమీని ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న‌ట్లు స‌మ‌చారం. మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిలిం సిటీ రూపకర్త రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వ‌ర్యంలో గ‌త సాయంత్రం సంస్మ‌ర‌ణ స‌భ నిర్వ‌హించింది.. ఆయ‌న‌కు నివాళిగా అమ‌రావతిలో ఆయ‌న పేరు ప్ర‌ధాన వీధికి పెట్ట‌నున్నారు. అలాగే విశాఖ‌లోని చిత్ర ప‌రిశ్ర‌మ కోసం కేటాయించే సెజ్ కు రామోజీ చిత్ర న‌గ‌రి పేరు పెట్టాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు..

ఇక అమ‌రావ‌తిలోనే రామోజీ రావు పేరిట ఒక ఆర్ట్ గ్యాల‌రీ కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఇక ఈ నేప‌థ్యంలోనే ఏపీ ప్రెస్ అకాడమీ పేరును ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రాజధాని అమరావతి పేరును రామోజీరావే సూచించిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోనూ రామోజీ విగ్రహం, అమరావతిలో రామోజీ స్మారకం నిర్మిస్తామన్నారు చంద్ర‌బాబు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement