Sunday, September 15, 2024

AP | రేపు కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన..

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (శుక్రవారం) అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బాబు బయల్దేరి….. 11.40కి కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.

11.50కి వానపల్లిలోని పళ్ళాలమ్మ గుడి వద్దకు వస్తారు. 11.50 నుంచి1.30 వరకు గ్రామసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఇక‌ 2 గంటల నుంచి 2.20 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో భేటీ అవుతారు.

2.20కి వానపల్లి గ్రామం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.35 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45కు ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.35 గంటలకు తెలంగాణ రాష్ట్రం బేగంపేట ఎయిర్ పోర్టుకి వెళ్తారు. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 4 గంటలకల్లా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement