ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటరలో భాగంగా ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని మోదీ సహా పలువురు మంత్రుల దృష్టికి మరోసారి సీఎం తీసుకువెళ్లనున్నారు. కాగా, ఈ రేపు (సోమవారం) ఉదయం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు.
రెండ్రోజులపాటు సాగనున్న ఈ పర్యటరలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చలు జరగనున్నాయి. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని సహా పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు.
సోమవారం ప్రధాని మోదీతో సమావేశం అయ్యి… వరద సహాయం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు కీలక అంశాలను ప్రధాని ఎదుట చంద్రబాబు పెట్టనున్నారు. ఇక మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు.. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లతో భేటీ కానున్నారు.