Friday, October 4, 2024

TTD | శ్రీవారికి పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించిన‌ చంద్రబాబు దంపతులు

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు వరిపట్టం చుట్టుకుని పట్టువస్త్రాలు తీసుకుని ఆలయానికి వెళ్లారు. తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి తొలుత బేడి ఆంజనేయస్వామిని ఆయన దర్శించుకున్నారు.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement