Tuesday, September 17, 2024

AP: శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న చంద్రబాబు

కర్నూలు బ్యూరో (నంద్యాల జిల్లా) : ద్వాదశాలలో రెండవ జ్యోతిర్లింగం… ఆరవ అష్టాదశ శక్తిపీఠం… ఇలలో వెలసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం గురువారం ఉదయం 11.10 గంటలకు బ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు.

ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో స్వామివారి దర్శనార్థం ఆలయంలోకి తీసుకువెళ్లిన అర్చకులు ప్రథ‌మంగా రత్నగర్భ గణపతికి పూజ చేయించారు. అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం బయట… ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాదాపు రూ.12 కోట్ల ఖర్చుతో స్వామి అమ్మవార్లకు బహుకరించిన బంగారు రథాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, డిఐజీ కే ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఆలయ ఈఓ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement