Friday, October 18, 2024

AP: పద్మావతి అమ్మవారిని ద‌ర్శించుకున్న చంద్ర‌బాబు..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని సీఎం దర్శించుకున్నారు. ఆలయం వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

దర్శనానంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. పద్మావతి అమ్మవారి దర్శనం ముగించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో గ‌న్న‌వ‌రానికి బ‌య‌లు దేరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement