Friday, September 6, 2024

AP: అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. అమరావతి ఫ్యూచర్ ప్లాన్ పై స్పష్టత ఇచ్చే అవకాశముంది. గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదికను పరిశీలించారు.

అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం సీడ్‌ యాక్సిస్ రోడ్ , ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాలు, మంత్రులు, జడ్జిల గృహసముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లును ఆయ‌న సంద‌ర్భించ‌నున్నారు. అలాగే రాజధాని ప్రాంతంలో నిర్మాణాల స్థితిగతులు పరిశీలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియాతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement