Monday, September 16, 2024

Delhi | కేంద్ర మంత్రి నిర్మ‌లతో చంద్రబాబు భేటీ !

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రానికి రుణ పరిమితి పెంచడంతో పాటు రాజధానికి ఇప్పిస్తామన్న పదిహేను వేల కోట్ల నిధుల గురించి.. ఇతర గ్రాంట్ల గురించి చర్చించారు.

కాగా, ప్రధానితో భేటీ అనంత‌రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు సమావేశం అయ్యారు. కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై ఆమెతో చర్చించారు. సత్వరమే నిధుల విడుదల జరిగేలా చూడాలని కోరారు. నిర్మలాతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు… అక్కడే ఉన్న కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.

చంద్రబాబు వెంట కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ లోక్ సభా పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement