Friday, October 18, 2024

Delhi | అమిత్ షాతో చంద్రబాబు భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విభజన హామీలు అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రిని సీఎం కోరినట్టు తెలిసింది. అలాగే, పోలవం ప్రాజెక్టు అంశాన్ని కూడా చర్చించినట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.

చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి ఢిల్లీలో బస చేయ‌నున్నారు. ఇక రేపు (బుధవారం) ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్‌లు ఖరారైనట్టు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. చంద్రబాబు వెంట రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరగానే కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు సహా పలువురు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement