Friday, October 4, 2024

AP CM : బాయిలర్ పేలిన ఘటనపై చంద్రబాబు ఆరా..

ఎన్టీఆర్ జిల్లాలో బాయిలర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం లో బాయిలర్ పేలి 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తక్షణం బాధితులకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

క్షతగాత్రులకు అందుతున్న వైద్యం వివరాలను సీఎంవో సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని అన్ని సదుపాయాలు ఉన్న ఆస్పత్రులకు తరలించారని సూచించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడడంతోపాటు ప్రభుత్వం నుంచీ సాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement