Friday, September 20, 2024

AP: ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం..

విజయవాడ: నగరంలోని ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. బ్యారేజీ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు వారికి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు కేంద్రబృందానికి అందజేశారు.

ఈనెల 1న రికార్డు స్థాయిలో 11.43లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపునకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం దృష్టికి ఆయన తీసుకెళ్లారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement