Friday, September 20, 2024

Delhi : ఏపీ పోలీసులకు కేంద్ర పురస్కారం..!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏపీ పోలీసులు పురస్కారాలు అందుకున్నారు. సిఐడి విభాగాధిపతి అయ్యన్నార్, కేజీవీ సరిత పురస్కారాలు అందుకున్నారు. ఆన్ లైన్ లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతిరు కనబరిచినందుకు గాను ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం పరిష్కారాన్ని ప్రకటించింది.

విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా సిఐడి విభాగాదిపతి అయ్యన్నార్, మహిళ సంరక్షణ విభాగం ఎస్పీ కేజీవి సరిత ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ సైబర్ కో ఆర్డినేషన్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ ను అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement