Friday, September 6, 2024

ఏపీ అసెంబ్లీలోకి సెల్ ఫోన్లు నిషేధం

ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీలోకి సెల్ ఫోన్లు తీసుకురావ‌ద్ద‌ని స్పీక‌ర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. శాసనసభలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సభలోకి సెల్ ఫోన్లను అనుమతించరాదని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ సభలో ఓ ప్రకటన చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై సభలో సభ్యులు ఫోన్లు తీసుకుని రావడానికి ఇక నుంచి అనుమతి లేదని ఆయ‌న ప్రకటించారు.

తాజాగా చంద్రబాబు ఎపిసోడ్ సమయంలో టీడీపీ సభ్యులు సభలో వీడియో రికార్డు చేయడం వివాదాస్పదమైంది. చంద్రబాబుకు స్పీకర్ మైక్ కట్ చేసినా చంద్రబాబు వీడియోను టీడీపీ సభ్యులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో సర్క్కులేట్ చేసేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement