Friday, October 18, 2024

AP: కర్నూలులో సినీనటి శ్రీరెడ్డిపై కేసు నమోదు..

కర్నూలు నగరంలోని మూడవ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో సినీనటి శ్రీరెడ్డి పై కేసు నమోదైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలను శ్రీరెడ్డి దూషించినట్లుగా కేసు నమోదయింది.

ముఖ్యమంత్రితో పాటు, మంత్రులపై సామాజిక మాధ్యమాల్లో శ్రీరెడ్డి అసభ్యకర కామెంట్స్ చేశారు. దీంతో మండిపడిన టీడీపీ నేత రాజుయాదవ్. మరికొందరితో కలిసి స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement