Wednesday, July 3, 2024

AP: చెట్టును ఢీకొన్న కారు… ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై ఇవాళ‌ తెల్లవారుజామున ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.

మృతులు గుంటూరుకు చెందిన వారిగా గుర్తించామని పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement