Friday, October 4, 2024

Calling Delhi .. హస్తినకు క్యూ క‌ట్టిన‌ బీజేపీ నేతలు


హస్తినకు తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ఎంపీలుగా విజయం సాధించిన బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్​రావు తదితరులు ఢిల్లీకి బ‌య‌లుదేరారు. రేపు ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులున్నారు. ప్రస్తుతం మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరిగింది. శుక్రవారం ఎంపీలుగా గెలుపొందిన పార్టీ నేతలతో మోదీ సమావేశం కానున్నారు. అనంతరం మిత్రపక్షాల నేతలు వేరుగా భేటీ అవుతారు.

టీడీపీ, జేడీయూ ఎంపీలకు కీలక పదవులు..

- Advertisement -

మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి.. ఏ పార్టీకి ఎన్ని పదవులివ్వాలో ఈ భేటీలో చ‌ర్చించ‌నున్నారు. రాజకీయ అనిశ్చితికి ఆస్కారం లేకుండా త్వరత్వరగా ఈ ప్రక్రియ ముగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత‌ నితీశ్‌ గట్టిగా సూచించినట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో ఉన్న పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఈసారి హోంశాఖ కాకుండా వేరే శాఖను కేటాయించవచ్చన్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జేడీయూ ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయని ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. మోదీ కేబినెట్‌లో చేరాలని తమ పార్టీ నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement