Tuesday, September 17, 2024

AP: అద్దంకిలో బస్సు బోల్తా.. 20మందికి గాయాలు

బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 20మందికి గాయాలయ్యాయి. అటువైపు వెళుతున్న వాహనదారులు ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు.

బస్సులో నుంచి బాధితులను బయటకు తీశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళుతున్న టీజీఎస్ ఆర్టీసీ బస్సు రాధాకృష్ణపురం వద్ద ప్రమాదానికి గురైందని పోలీసులు చెప్పారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో 20మందికి పైగా గాయాలయ్యాయని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement