Saturday, October 5, 2024

AP: బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు..

పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పెద్దపంజాణి మండలం బసవరాజ కండ్రిగ వద్ద అనంతపూర్ నుండి రామేశ్వరంకు వెళుతున్న బస్సు బసవరాజు కండ్రిగ వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బోల్తా పడ్డ సంఘటన జరిగింది. పలు పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి అందులో ప్రయాణిస్తూ కాణిపాకం ఆలయానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

వీరిని పలమనేరు ప్రభుత్వాసుపత్రి నుండి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. కాగామొత్తం 21 మందికి గాయాలైనట్లు సమాచారం. ఈ మేరకు పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు… కాగా మృతిచెందిన వారిలో తుంకూర్ డిస్టిక్ కర్ణాటక రాష్ట్రం మురార మనహళ్లికి చెందిన లేట్ దేవారెడ్డి కుమారుడు నరసింహారెడ్డి.. సత్యసాయి జిల్లా పెనుగొండ తాలూకా రోద్దం మండలం చిన్న గువ్వలపల్లి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి భార్య రామాంజమ్మలు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement