Sunday, September 15, 2024

AP | కరెంట్ షాక్ తో బాలుడు మృతి..

పుంగనూరు, (ప్రభ న్యూస్) : పావురాలతో ఆడుకుంటూ విద్యుత్ తీగలు తగిలి ఓ బాలుడు మృతి చెందిన ఘటన పుంగనూరు పట్టణంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగలడంతో బాలుడు షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు బాలుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ముక్కుపచలారని బిడ్డ కళ్ళ ఎదుటే విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement