Thursday, October 24, 2024

విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లిలోని బిస్కెట్‌ ఫ్యాక్టరీ దగ్గర బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి చెందారు. కర్నాటక నుంచి కుర్గేపల్లెకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతుల వివరాలను తెలిపారు. మృతులు మదనపల్లెకు చెందిన నరేష్ (32), ఉమాదేవి (27), చిన్నారి నిషిత (2)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మదనపల్లెలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement