Sunday, June 30, 2024

Big Relief – ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కి హైకోర్టులో ఊర‌ట

అమ‌రావ‌తి – వైసీపీకి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మండలి చైర్మన్ మోషెన్‌ రాజు‌, విప్‌ పాలవలస విక్రాంత్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేసింది.

పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి చైర్మన్‌ మోషెన్‌ రాజుకు.. విప్‌ పాలవలస విక్రాంత్‌ ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజును అనర్హుడిగా ప్రకటిస్తూ ఈ నెల 3వ తేదీన మండలి చైర్మన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే చైర్మన్‌ నిర్ణయాన్ని రఘురాజు తప్పుబట్టారు. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

- Advertisement -

రఘురాజు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌ సతీమణి టీడీపీలో చేరారనే కారణంతో పార్టీ ఫిరాయింపుల కింద ఆయన్ను అనర్హుడిగా ప్రకటించారని వైసీపీ తరఫున సీనియర్‌ లాయర్‌ జంధ్యాల రవిశంకర్‌ హైకోర్టుకు వివరించారు. ఎమ్మెల్సీ సతీమణి తీసుకున్న నిర్ణయానికి పిటిషనర్‌ను బాధ్యుణ్ని చేయడం సరికాదని రఘురాజు తరఫున న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రఘురాజు స్థానాన్ని ఖాళీ అయినట్లుగా నోటిఫై చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement