Monday, September 16, 2024

AP | భళా, భళా బాహుబలి మరియప్ప..

కోసిగి, (ప్రభ న్యూస్) : బాహుబలి సినిమాను తలపించే విదంగా కర్ణాటకకు చెందిన మరియప్ప అనే యువకుడు కోసిగి మండలం కందుకూరు గ్రామంలో (సోమవారం) జరిగిన శ్రీ ఊరుకుందఈ రన్న పల్లకోత్సవం ఉత్సవాలలో నిర్వహించిన క్రీడా పోటీలలో పాల్గొని 220 కేజీల ఇసుక సంచి 200 కేజీల రాతి గుండును ఎత్తి భళా భళా బాహుబలి అనిపించుకున్నాడు.

ప్రతి సంవత్సరం ఎంతో కందుకూరు ఆసక్తికరంగా జరిగే ఈ పోటీలలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మరియప్ప కొన్నేళ్లుగా పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందుతూ బహుమతులు గెలుచుకుంటూ హాజరైన ప్రజలతో శభాష్ అనిపించుకున్నాడు.

గెలుపొందిన మరియప్ప ను ఊరేగింపు అనంతరం మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్రరెడ్డి, కోసిగి టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి, కందుకూరు ఆయ్యన్నలు అభినదించి , సన్మానించి నగదు బహుమతులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement