Thursday, September 12, 2024

Flood Relief Fund | బాలకృష్ణ వ‌ర‌ద సాయం కోటి….

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇరు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. ఈ క్ర‌మంలో వరద బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ముందుకు వస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విరాళాలను ప్రకటించారు.

తాజాగా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన వంతుగా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

ఇక ఇప్ప‌టికే, రెండు ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాలకు జూ.ఎన్టీఆర్ రూ.50 లక్షల చొప్పున… సిద్ధు జొన్నలగడ్డ రూ.15 లక్షల చొప్పున… మరో హీరో విష్వక్సేన్ రూ.5 లక్షల, క‌ల్కి మూవీ టీం రూ.25 ల‌క్ష‌ల చొప్పున విరాళం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement