Friday, October 4, 2024

AP HighCourt: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్..

అమరావతి: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

సురేష్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే మాజీ ఎంపీ సురేష్‌పై ఉన్న హత్య కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు. తుళ్ళూరు పోలీసులు వేసిన పీటీ వారెంట్‌కు ట్రయల్ కోర్టు అనుమతించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement