Wednesday, September 18, 2024

Babu Mohan పసుపు చొక్కా వేసుకుని…

హైదరాబాద్ – మాజీ మంత్రి బాబు మోహన్ ఆదివారం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన బాబు మోహన్.. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు. అయితే, ప్రజాశాంతి పార్టీలో చేరినప్పటికీ.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న బాబు మోహన్ తాజాగా, చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, బాబు మోహన్ రాజకీయ జీవితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నుంచే ప్రారంభమైంది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement