Thursday, October 17, 2024

AP: అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం అయ్యారు. స్పీకర్ పదవికి కోసం ఆయన ఈ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. సాయంత్రం మరో నామినేషన్ దాఖలుకాకపోవడంతో స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవం అయింది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అయ్యపాత్రుడు నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన మంత్రి, ఎంపీగా సైతం పని చేశారు. ప్రస్తుతం ఆయనకు స్పీకర్‌గా అవకాశం దక్కింది. దీంతో ఆయన మాట్లాడుతూ సీనియర్ నేతగా చాలా పదవులు అనుభవించానని, అప్పుడు స్పీకర్‌గా ప్రజలకు మరింత సేవ చేస్తానని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement