Friday, October 18, 2024

Aviation – స్థ‌లం చూపండి … అనంత‌లో విమానాశ్ర‌యం ఏర్పాటు చేస్తాం – కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు

అనంతపురంలో అనువైన భూమి చూపితే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం మొదలుపెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి ఇటీవల చేసిన విజ్ఞప్తిపై ఆయన స్పందించారు. విమానాశ్రయానికి కావాల్సిన భూమి చూపితే తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. ఇందుకు 1,200 ఎకరాలు అవసరమవుతాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement