Saturday, October 5, 2024

Avanigadda – సీబీఐకి శ్రీహరి మర్డర్​ కేసు…

నాలుగేళ్ల కిందట ఘటన
సీఎం దృష్టికి తీసుకెళ్లిన బుద్ధ‌ప్ర‌సాద్‌
తక్షణమే సీఎం చంద్ర‌బాబు స్పందన
కేసు పీఠ‌ముడి వీడుతుంద‌ని ఆశాభావం

ఆంధ్రప్రభ స్మార్ట్, అవనిగడ్డ : నాలుగేళ్ల కిందట అవనిగడ్డ నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపిన డాక్టర్ కోట శ్రీహరి రావు హత్య కేసు విచారణ తెరమీదకు వచ్చింది. ఇక సీబీసీఐడీ ఈ కేసు అంతుతేల్చనుంది. ఈ సమాచారాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. నాలుగేళ్లుగా ఈ కేసు మిస్టరీ పీటముడిని స్థానిక పోలీసులు విప్పలేకపోయారు. డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యోదంతాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ల‌డంతో స్పందించారు. సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. కాగా, ఈ విచారణను వేగవంతంగా జరిపిస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురిచేసిన ఈ హత్యను సీబీసీఐడీ తప్పని సరిగా ఛేదిస్తుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement