Thursday, September 26, 2024

AP: అవుకు రిజర్వాయర్ ఆనకట్టను పటిష్టం చేసిన అధికారులు…

నంద్యాల బ్యూరో, సెప్టెంబర్ 26 (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లాలో అవుకు రిజర్వాయర్ వద్ద గల తిమ్మరాజు బండ ఆనకట్ట కుంగిపోయిన సంగతి పాఠకులకు తెలిసిందే. గురువారం ఇరిగేషన్ అధికారులు రివిట్ మెంట్ ను పటిష్టం చేశారు.

ఒక మీటర్ విస్తీర్ణం, 1.5 మీటర్ల లోతు నీటిలో మునిగిన రివిట్మెంట్ ను తక్షణమే సరిచేసిన ఇరిగేషన్ అధికారులు. ఇరిగేషన్ అధికారులు ఇసుక బస్తాలతో రివిట్ మెంట్ ను మరింత పటిష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement