Thursday, September 19, 2024

AP: మంత్రి ఫరూక్ కుమారుడిపై దాడి..

మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ పై దాడి జరిగింది. నంద్యాల టీడీపీ కార్యాలయం నుంచి ఆయన కారులో వెళ్తుండగా నలుగురు యువకులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. కారులో నుంచి దుండగలను పట్టుకునేందుకు ఫిరోజ్, ఆయన అచరులు ప్రయత్నం చేశారు. మణికంఠరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురు పారిపోయారు.

పట్టుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఫిరోజ్‌పై దాడికి గల కారణాలను పోలీసులు రాబడుతున్నారు. అయితే కావాలనే ఫిరోజ్‌పై దాడి చేశారని అనుచరులు అంటున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement