Monday, September 16, 2024

Atchyutapuram Blast – సహాయ కార్యక్రమాలలో పాల్గొనండి – జన సైనికులకు పవన్ పిలుపు

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అనకాపల్లి – అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీల జరిగిన ప్రమాదంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. . వార్త తెలిసిన వెంటనే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఘటన వివరాలు కార్యాలయానికి అందించాలని ఆదేశించారు..

పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ తో మాట్లాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన కార్మికుల వివరాలు తెలుసుకుని, చేపడుతున్న రక్షణ చర్యలపై ఆరా తీశారు.

- Advertisement -

స్థానిక యలమంచిలి నియోజకవర్గ ఎంఎల్ఏ సుందరపు విజయ్ కుమార్ తో మాట్లాడి రక్షణ చర్యల్లో నాయకులు, జనసేన శ్రేణులు పాల్గొనాలని ఆదేశించారు.

అలాగే ఇతర సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేశారు పవన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement