Tuesday, October 22, 2024

AP | గుర్ల ఘటనపై విచారణ అధికారి నియామ‌కం..

అమరావతి, ఆంధ్రప్రభ : విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో అతిసార మృతుల ఘటనలపై విచారణాధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ను విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. అతిసార ప్రబలడానికి గల కారణాలు, అక్కడ పరిస్థితులపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. దీనిప్రకారం ప్రభుత్వం తరఫు నుంచి బాధితులకు తగిన నష్టపరిహారం అందజేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ బాధితులకు భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement