Friday, September 13, 2024

AP | ప‌లు యూనివర్సిటీలకు ఇన్ చార్జి వీసీల నియామకం..

ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఎస్‌వీయూ ఇన్‌ఛార్జ్‌ వీసీగా చిప్పాడ అప్పారావుగా నియమితులయ్యారు. శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ ఇన్‌ఛార్జి వీసీగా బి.అనిత, కృష్ణా వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా ఆర్‌. శ్రీనివాస్‌రావును నియమించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ బాబ్జీ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు.

ఇంఛార్జ్ వీసీలు వీరే :

  • జేఎన్‌టీయూ కాకినాడ – మురళీ కృష్ణ
  • నన్నయ వర్సిటీ – శ్రీనివాసరావు
  • విక్రమ సింహపురి వర్సిటీ – సారంగం విజయభాస్కర్‌రావు
  • కృష్ణా వర్సిటీ – ఆర్‌. శ్రీనివాస్‌రావు
  • ఆంధ్రా యూనివర్సిటీ- గొట్టపు శశిభూషణ్‌రావు
  • వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్‌, పైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ – విశ్వనాథకుమార్‌
  • ఆంధ్రకేసరి వర్సిటీ – డీవీఆర్‌ మూర్తి
  • అబ్దుల్‌ హక్‌ ఉర్దూ వర్సిటీ – పఠాన్‌ షేక్‌ ఖాన్‌
  • నాగార్జున యూనివర్సిటీ – కంచర్ల గంగాధర్‌
  • జేఎన్‌టీయూ అనంతపురం – సుదర్శన్‌రావు
  • పద్మావతి మహిళా వర్సిటీ – ఉమ
  • జేఎన్‌టీయూ విజయనగరం – రాజ్యలక్ష్మి
  • రాయలసీమ వర్సిటీ – ఎన్‌టీకే నాయక్‌
  • ద్రవిడ వర్సిటీ – దొరస్వామి
  • యోగి వేమన వర్శిటీ – కృష్ణారెడ్డి.
Advertisement

తాజా వార్తలు

Advertisement