Monday, October 21, 2024

AP హోం మంత్రితో వైఎస్ సునీత భేటి

వివేకా హ‌త్య కేసుపై చ‌ర్చ‌
నిందితులు పోలీసుల అంట‌కాగారంటూ ఆరోప‌ణ‌
ఈ కేసులో త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరిన సునీత

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమరావతి: వైఎస్‌ వివేకా కుమార్తె సునీత ఏపీ హోంమంత్రి అనితను నేడు అమ‌రావ‌తిలో కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు. సీబీఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులను బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు. ఈ కేసు సీబీఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అనిత తెలిపారు. దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement