Thursday, September 19, 2024

AP | చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ !

ముఖ్యమంత్రి చంద్రబాబును సునీత దంపతులు కలిశారు. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న తమపై….. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తమపై తప్పుడు కేసులు పెట్టించారని ఫిర్యాదు చేశారు.

ఆ కేసుల‌పై పునర్విచారణ చేయించాలని…. తమతో పాటు కేసులో చురుకుగా దర్యాప్తు చేస్తున్న అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ పైనా కేసులు పెట్టారన్నారు. ఈ కేసుల వెనుక ఉన్న కుట్రలపై సీఐడీతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ సునీత విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వారిపై పెట్టిన కేసు విషయంలో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement