Monday, October 7, 2024

AP | ఎన్నికల ప్రధాన అధికారిగా వివేక్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా (ఎన్నికల ప్రధాన అధికారిగా) సీనియర్ ఐఏఎస్‌ అధికారి వివేక్ యాదవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వివేక్‌ యాదవ్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సీఈవో బాధ్యతల నుంచి ముఖేష్‌ కుమార్ మీనా రిలీవ్ కానున్నారు.

అయితే, ముఖేష్‌ కుమార్‌ మీనాకు కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ముఖేష్‌ కుమార్‌ మీనా నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement