Monday, September 16, 2024

AP – నేటి నుంచే ఏపీలో వన మహోత్సవం – విజయవంతం చేయాలని పవన్ పిలుపు

అమరావతి – నేటి నుంచే ఏపీలో వన మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో సందేశం ఇచ్చారు..

వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని, రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు.

వనమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ”ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 శాతం మాత్రమే పచ్చదనం ఉంది. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోండి. మొక్కల పెంపకం అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలి

- Advertisement -

.https://x.com/UttarandhraNow/status/1829356690812379515

Advertisement

తాజా వార్తలు

Advertisement