Friday, September 20, 2024

AP – హంసలదీవి బీచ్ లో ఇద్దరు గల్లంతు

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అవనిగడ్డ – ఎపి లోని హంసల దీవి బీచ్ లో గుడివాడకు చెందిన ఐదుగురు పర్యటకులు గల్లంతు అయ్యారు. అయితే ఐదుగురు సముద్రంలో కొట్టుకుపోతుండగా ముగ్గురుని తోటి పర్యటకులు, మెరైన్ పోలీసులు కలిసి కాపాడారు..

కానీ ఆ ముగ్గురు సముద్ర నీరు తాగేయడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక సముద్రంలోకి కొట్టుకుపోయిన ఇద్దరిలో ఒక్కరు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకు వచ్చారు. మృతి చెందిన షేక్ ఫజల (26) అని గుర్తించారు. ఇక గల్లంతైన వ్యక్తి ముషారఫ్ (20) అని తెలిపారు.

- Advertisement -

ఈరోజు ఉదయం గుడివాడ నుంచి హంసలదీవి బీచ్ వద్దకు విహారయాత్రకు వచ్చారు ఈ పర్యటకులు. ప్రస్తుతం గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు మెరైన్ పోలీసులు. కాపాడిన ఆ ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరైన్ సిబ్బంది.

..

Advertisement

తాజా వార్తలు

Advertisement