Saturday, September 21, 2024

AP బంగారుపాళ్యం వద్ద మరో రోడ్డు ప్రమాదం …. ఇద్దరి దుర్మరణం

చిత్తూరు, సెప్టెంబర్ 14 (ప్రభ న్యూస్ బ్యూరో) మొగిలి ఘాట్ లో లారీలు, బస్సు ఢీ కొని ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన మరువక ముందే బంగారుపాళ్యం సమీపంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. బెంగళూరు నుంచి తిరుపతికి దైవ దర్శనానికి బెంగళూరు దొడ్డబల్లాపుర నుండి ఒక ఫ్యామిలీ శనివారం వేకువ ఝామున బయలుదేరింది.

ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో బంగారుపాళ్యం చేరుకుంది. వారు ప్రయాణం చేస్తున్న ఇన్నోవా కారు టైరు పేలడంతో బంగారుపాళ్యం ప్లై ఓవర్ బ్రిడ్జిపైన ప్రమాదం జరిగింది. కారు అదుతప్పి బోల్తాపడి పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జు అయ్యింది. కారులోని బెంగళూరుకి చెందిన గంగయ్య 56, లక్ష్మీ 35 అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసమూర్తి 51, సుచిత్ర 48, ఉష 32, ధరణి 22 గాయపడ్డారు. ప్రమాద సంఘటన తెలియగానే బంగారుపాళ్యం ఎమ్మార్వో బాబు రాజేంద్రప్రసాద్, బంగారుపాళ్యం సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాంభూపాల్ అక్కడికి చేరుకున్నారు.

మృతదేహాలను బంగారుపాళ్యం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి బంగారుపాళ్యం ఆస్పత్రిలో ప్రధమ చికిత్స చేసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే వారు కోలారు ఆసుపత్రికి వెళ్తామని అన్నారు. దీంతో పోలీసులు వారిని అంబులెన్స్ లో కోలారుకు పంపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement