Sunday, September 22, 2024

AP – నేడు చంద్రబాబుతో టీటీడీ ఈ వో భేటి

అమరావతి – తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు తో సమావేశం కానున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక అందించనున్నారు.

ఆగమ సలహా మండలి సూచనలను ఆయనకు వివరించనున్నారు. రిపోర్ట్ అందిన తర్వాత ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకోనుంది. టీటీడీ ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి అందింది.

దీంతో పాటు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు సీఎం చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించనుంది. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త నివేదిక ఇవ్వనున్నారు టీటీడీ ఈవో..

- Advertisement -

ఇక, టీటీడీ ఈవో నిన్న అందించిన ప్రాథమిక నివేదికపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement