Friday, October 4, 2024

AP | ఐదుగురు అదనపు ఎస్పీలకు బదిలీలు, పోస్టింగ్స్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఐదుగురు అదనపు ఎస్పీలకు పోస్టింగ్‌, బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వెయింటింగ్‌లో ఉన్న ఎస్‌. ఖాదర్‌ బాషాను ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ ఎస్పీగా, ఎన్‌. యుగంధర్‌ బాబును నంద్యాల అడిషనల్‌ ఎస్పీగా పోస్టింగ్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే గుంటూరు లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ ఎస్పీగా ఉన్న కొల్లి శ్రీనివాసరావును వి అండ్‌ ఈ అడిషనల్‌ ఎస్పీగా, సీఈడి అడిషనల్‌ ఎస్పీగా ఉన్న ఎన్‌. సూర్యచంద్రరావును ఏలూరు అడిషనల్‌ ఎస్పీగా, ఎసీబీ అడిషనల్‌ ఎస్పీగా ఉన్న కె. సుప్రజను గుంటూరు క్రైమ్‌ అడిషనల్‌ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement