Saturday, June 29, 2024

AP – జిఎడిలో రిపోర్ట్ చేయండి…. ముగ్గురు కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వీస్ అధికారుల‌కు ఆదేశం

అమరావతి: ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఓఎస్డీ బి.అనిల్ కుమార్ రెడ్డి, ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఇన్కాప్ ఎండీ నీలకంఠారెడ్డి, సంప్రదాయేతర ఇంధన వనరులు కార్పొరేషన్ ఎండీ నంద కిషోర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ముగ్గురిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement