Friday, October 18, 2024

Ap:ఘ‌నంగా ప్రారంభమైన తొలేళ్ల సంబ‌రం


అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న మాన్సాస్ ఛైర్మ‌న్ అశోక్ గ‌జ‌ప‌తి
ప‌ట్టువ‌స్త్రాలు స‌మర్పణ
కుటుంబ స‌మేతంగా ఎంపీ క‌లిశెట్టి పూజ‌లు
విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 14 (ఆంధ్రప్రభ) : శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి తొలేళ్ల సంబ‌రం సోమ‌వారం ఘ‌నంగా ప్రారంభమైంది. నగరమంతా పండ‌గ శోభ‌ సంత‌రించుకుంది. పులివేషాలు, క‌ర్ర‌సాము, క‌త్తిసాము, విచిత్ర వేషాలతో ప‌ట్ట‌ణంలో సంద‌డి నెల‌కొంది. అమ్మ‌వారికి మొక్కులు స‌మ‌ర్పించేందుకు భ‌క్తులు బారులు తీరారు. ఘ‌టాల‌తో, అమ్మ‌వారి నామ స్మ‌ర‌ణ‌తో నగరం మారుమ్రోగింది. వివిధ ప్రాంతాల నుంచి ప‌ట్ట‌ణానికి భ‌క్తుల రాక మొదలైంది.

నగరం ప్ర‌ధాన ర‌హ‌దారులు భ‌క్తుల‌తో నిండిపోయాయి. మాన్సాస్ ఛైర్మ‌న్‌, కేంద్ర మాజీ మంత్రి పూస‌పాటి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, ఎమ్మెల్యే అదితి విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు. వారికి ఆల‌య అధికారులు, పూజారులు అధికార లాంఛ‌నాల‌తో స్వాగ‌తం ప‌లికారు. ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు స‌తీస‌మేతంగా అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ప్ర‌త్యేక పూజ‌లు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement